Monday, April 29, 2024

Breaking: కరీంనగర్ లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్‌ పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద ఎ కారు బీభత్సం సృష్టించింది. హైద్రాబాద్ రాడ్డుపై అతివేగంగా వెళుతున్న కారు.. అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న గుడిసెలలోకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్‌ అతి వేగం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారు కె రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement