Monday, May 20, 2024

బాణాసంచా కాలుస్తూ 24మంది గాయాలు..ఐదుగురి పరిస్థితి విషమం

ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా దీపావళికి బాణాసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. హైదరాబాద్‌లోనే 24 మంది గాయపడగా వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడి వారిలో ఎక్కువమంది కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరందరూ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువమంది చిన్నారులేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 12 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అలాగే, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగింది. చిన్నాపెద్దా టపాసులు కాస్తూ పండుగను జరుపుకున్నారు. గ్రహణం కారణంగా మంగళవారం జరుపుకోవాల్సిన పండుగను దేశప్రజలు నిన్ననే జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement