Tuesday, April 30, 2024

WGL: నలుగురు గంజాయి స్మగ్లర్లకు 20ఏళ్ల జైలుశిక్ష…

గూడూరు (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో 2021 సంవత్సరంలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్ల నేరం రుజువు కావడంతో నలుగురు నేరస్తులకు 20ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ శిక్ష విధించడం జరిగిందని గూడూరు ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపారు.

వారి వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలంలోని బిసకోబాల తండాకు చెందిన ధరంషోత్త శీను తండ్రి నందియా ధారావత్ కిరణ్ కుమార్ తండ్రి సుందర్ బ్రాహ్మణపల్లి గ్రామం తోపాటు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ తండ్రి లతీఫ్ షరీఫ్ దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన పల్లకొండ సాంబమూర్తి తండ్రి ఎల్లయ్యలపై కేసు నంబర్ 169/ 2021లో గంజాయి కేసు నమోదు అయిందని పేర్కొన్నారు. నేటి వరకు కోర్టులో కేసు కొనసాగుతుందని సాక్షాలు రుజువు కావడంతో వారిపైన నేరం మోపబడిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement