పాట్నా: బిహార్లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నేటి మధ్యాహ్నం జరిగింది. . సివిల్ కోర్టు కాంప్లెక్స్లోని గేట్ నంబర్ వన్ సమీపంలోని ట్రాన్స్ఫర్మర్ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు పేలింది..వెనువెంటనే భారీగా మంటలు వ్యాపించాయి.. ఈ ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్గా గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement