Monday, April 29, 2024

పండగపూట విషాదం.. చెరువులో పడి బాలుడు మృతి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఊర చెరువులో పడి సాయి చరణ్ (14) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి ఊర చెరువులో ఈతకు వెల్లగా ప్రమాదవశాత్తు సాయి చరణ్ చెరువులో మునిగిపోయాడు. గమనించిన మిత్రులు సాయి చరణ్ కోసం గాలించగా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం శవమై తేలాడు. రామడుగు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement