Tuesday, May 7, 2024

దీప్తి, ష‌ణ్ముఖ్ ల‌ని క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తోన్న బిగ్ బాస్ టీం

యూట్యూబ్ స్టార్స్ దీప్తి, ష‌ణ్ముఖ్ ల బ్రేక‌ప్ గురించి అంద‌రికీ తెలిసిందే.. అయితే వీరిద్ద‌రూ క‌లిస్తే బాగుంటుంద‌ని వారి ఫ్యాన్ కోరుకుంటున్నారు. కాగా ఫిబ్ర‌వ‌రి14న వాలంటైన్స్ డే. ఈ సంద‌ర్భంగా ఈ జంట మ‌ళ్ళీ తెర‌పై సంద‌డి చేయాల‌ని కోరుతున్నారు అభిమానులు. ఆ మధ్య షణ్మఖ్‌ తండ్రి కూడా మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో కొంచెం హోప్ వచ్చింది ఫ్యాన్స్ లో. కాని దీప్తి సునయనకు మళ్ళీ షణ్నుతో కలిసే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనెల 14న వాలంటైన్స్‌ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ బాధ్యతను స్వయంగా బిగ్‌బాస్‌ తీసుకున్నట్టు స‌మాచారం.బిగ్ బాస్ షో వీరి కలయికకు వేదిక కాబోతోందని ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్‌ సెలబ్రెషన్స్‌కు ప్లాన్‌ చేశారట బిగ్ బాస్ టీమ్. ఆ రోజు 5 సీజన్ల బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు సమాచారం.

అంతే కాదు అదే రోజు.. అంటే పిబ్రవరి 14న బిగ్‌బాస్‌ ఓటీటీ కూడా స్టార్ట్ కాబోతుంది. దీంట్లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఈవెంట్ కు సంబధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని.. చాలా వరకూ షూటింగ్ చేసినట్టు స‌మాచారం. ఇందులోనే దీప్తి సునయనకు మళ్ళీ షణ్నుతో మళ్లీ కలవబోతున్నట్టు ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో షణ్ముఖ్-దీప్తిలను జంటగా చూపించే ప్రయత్నంచేస్తున్నారట షో నిర్వాహకులు. దీంతో వారి మధ్య మళ్లీ కెమిస్ట్రీ పెరిగి ఒకరిని మరొకరు అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement