Friday, April 26, 2024

వైసీపీలో లుకలుకలు.. సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే ఆరోపణలు

రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి ఎంపీ భరత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టిన జేడీ లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ భరత్ సెల్ఫీలు తీసుకుంటారా? అని నిలదీశారు.

రౌడీషీటర్లు, భూకబ్జాదార్లు ఎంపీ భరత్ వెనుక ఉన్నారని.. ఆయన చీప్ చేష్టలు, పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎంపీ భరత్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గంలో తన వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. తనపై చేయాల్సిన వ్యాఖ్యలు చేసేసి.. చివరిగా ఎంపీ భరత్ తూచ్ అంటున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఎంపీ భరత్ తన వైఖరిని మార్చుకోవాలని.. లేకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement