Thursday, April 25, 2024

వెంకీ గ్రీన్ సిగ్నల్ కోసం అనుదిప్ వెయిటింగ్..

‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. కామెడీతో కబడ్డీ ఆడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుదీప్ ని ఆ సినిమా సక్సెస్ తర్వాత పలు ఆఫర్స్ పలకరించాయి. అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ.వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఇక ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వే. అనుదీప్ ఈ సారి కూడా కామెడీనే నమ్ముకుంటున్నాడట. తన కథకి వెంకటేశ్ న్యాయం చేయగలడని భావించి ఆయకు కథ వినిపించాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పని లో ఉన్నాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితే వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుని వెంటనే అధికారికంగా ప్రకటిస్తారట.

ఇది కూడా చదవండి: ముదిరిన వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement