Thursday, April 25, 2024

కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. బిజినేప‌ల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భూ సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. అధికారుల తీరుకు నిరసనగా నిప్పు అంటించుకునే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీగార్డు, ఉద్యోగులు అడ్డుకుని అదనపు కలెక్టర్ చాంబర్‌ గదిలోకి తీసుకెళ్లారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి జ్యోతికి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని, ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాద‌ని హామీ ఇచ్చారు.

తన భర్త చనిపోవడంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారని జ్యోతి తెలిపింది. ఆ భూమి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని, వార‌స‌త్వంగా త‌న‌కు రావాల్సిన భూమి బంధువులు లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజులుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కరించడం లేదని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement