Tuesday, April 30, 2024

Breaking: పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ గూడ్స్ రైలు..

ఆంధ్రప్ర‌దేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దులో నడిచే విశాఖ- కిరండోల్‌ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఒడిశా పాడువా రైల్వే స్టేషన్ శివారు ప్రాంతంలోకి చేరుకోగానే గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌పై నుంచి మూడు బోగీలు ఒక పక్కకు ఒరిగాయి.

విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కిరండోల్-విశాఖ ప్యాసింజర్ రైలు కాస్త ఆలస్యంగా నడుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement