Saturday, May 4, 2024

Assets – లోకేశ్‌ బాగా రిచ్ …కేటీఆర్ కంటే ఆస్తులెక్కువే

ఎన్నికల అఫిడవిట్​లో వివరాల వెల్లడి
ఇద్దరు మాజీ సీఎంల తనయుల మధ్య కంపేరిజన్​
ఎవరు రిచ్​ అంటూ ఆరా తీస్తున్న నెటిజన్లు
లోకేశ్​ కంటే బ్రహ్మణి దగ్గరే డబ్బులెక్కువ
లోకేశ్​, బ్రహ్మణి ఆస్తులు ₹523 కోట్లు
స్థిర, చరాస్తులతోపాటు.. వ్యాపారాల్లో పెట్టుబడులు
కేటీఆర్​, శైలమ దంపతుల ఆస్తుల విలువ ₹51 కోట్లు
ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్‌స‌భ‌ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో వారి ఆస్తిపాస్తుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున ఉన్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఏపీలో చంద్రబాబు, లోకేశ్ మాదిరిగానే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఐటీ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ప్రధాన పార్టీల అధినేతలు, మాజీ ముఖ్యమంత్రుల తనయులైన కేటీఆర్-లోకేశ్ ఆస్తిపాస్తులు, ఆదాయం, అప్పులు ఎలా ఉన్నాయో ఎన్నిక‌ల అఫిడ‌విట్ వివ‌రాలేంటో తెలుసుకుందాం..

- Advertisement -

నారా లోకేశ్‌:

చంద్రబాబు తనయుడు లోకేశ్ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. మళ్లీ ఆయన మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఆయన నామినేషన్ కూడా దాఖలుచేసారు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తిపాస్తులను పేర్కొన్నారు. అలాగే భార్య బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా లోకేశ్‌ వెల్లడించారు. లోకేశ్‌తో పాటు బ్రహ్మణి ఆస్తుల విలువ ₹523 కోట్లుగా ప్రకటించారు. లోకేశ్​ ఆదాయం ₹1,41,64,363గా ఉంది. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ ₹92,31,09,546 కాగా, చరాస్తుల విలువ ₹341,68,22,459గా ఉంది. ఇక లోకేశ్​ అప్పుల విషయానికి వస్తే ₹3,48,81,937 కోట్టుగా పేర్కొన్నారు.

లోకేశ్​ కంటే బ్రహ్మణి ఆదాయం ఎక్కువే..

లోకేశ్​ సతీమణి బ్రహ్మణి ఆదాయం.. భర్త కంటే ఎక్కువగా ₹7,57,04,812గా ఉంది. స్థిరాస్తులు ₹35,59,21,125 కాగా, చరాస్తులు ₹45,06,30,277గా ఉన్నాయి. ఆమె అప్పులు ₹14,34,37,042గా ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్రహ్మణి తన తల్లి వసుంధర నుంచి ₹42 లక్షలు, తండ్రి బాలకృష్ణ నుండి ₹16 లక్షలు, అత్త భువనేశ్వరి నుండి ₹10 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఇవి కాకుండా బ్రహ్మణి దగ్గర ₹2500 గ్రాముల బంగారం (కోటి రూపాయల విలువు), మరో కోటిన్నర రూపాయల విలువైన డైమండ్స్, రత్నాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. కొడుకు దేవాన్ష్​తో కలిపి హైదరాబాద్​లోని ఓ వాణిజ్య భవనంలో 50 శాతం వాటాను బ్రహ్మణి కలిగి ఉన్నారు. ఇలా లోకేశ్​, బ్రహ్మణి దంపతులకు హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్​లో షేర్లు ఉన్నాయి. బ్రహ్మణి పేరిట మాదాపూర్​లో కొంత భూమి, రంగారెడ్డిలో వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం ఉంది.

కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) :

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ తనయుడు కేటీ రామారావు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే హైదరాబాద్​లో ఐటీ బాగా అభివృద్ది చెందిందని … అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఓడినా హైదరాబాద్​లో మాత్రం బీఆర్ఎస్ గెలిచిందని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కేటీఆర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీచేసి గెలిచారు. అయితే.. నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలిలా ఉన్నాయి. కేటీఆర్-శైలిమ దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ ₹51 కోట్లు మాత్రమే. ఇందులోనూ శైలిమ పేరిట ఉన్న ఆస్తులే ఎక్కువ. కేటీఆర్ పేరిట ₹6.92 కోట్ల చరాస్తులు మాత్రమే ఉన్నాయి.

శైలిమ పేరిట ఆస్తులే ఎక్కువే..

కేటీఆర్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్లు, కొంత నగదు, టీ న్యూస్​లో వాటా, బంగారం, వెండి విలువ ఇది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే కేటీఆర్ పేరిట ₹17.83 కోట్ల విలువైనవి ఉన్నాయి. కేటీఆర్​కు ₹11.89 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. ఇక శైలిమ చరాస్తుల విలువు భర్త కేటీఆర్ కంటే ఎక్కువగా ఉంది. ఆమెకు ₹26.49 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. నగదు, డిపాజిట్లు, ఈటీజీ గ్లోబల్ సర్వీసెస్​లో షేర్లు, ఎట్ హోం హాస్పిటాలిటీలో వాటాతో పాటు గోల్డ్ బాండ్లు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement