Sunday, May 5, 2024

ఉక్రెయిన్ విద్యార్థుల కోసం బ‌య‌లుదేరిన విమానాలు – కేంద్ర‌మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

ఎనిమిది విమానాలు బుకారెస్ట్ నుంచి, రెండు విమాన స‌ర్వీసులు సుసేవ నుంచి, కోసీ నుంచి ఒక‌టి, బుడాపెస్ట్ నుంచి ఐదు,రెస్జోవ్ నుంచి 3విమాన స‌ర్వీసులు ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థుల కోసం బ‌య‌లుదేర‌తాయ‌ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోడీజీ ఆదేశాలతో ఒక్కరోజే 3,726 మందిని తరలిస్తున్నట్టు చెప్పారు. జ్యోతిరాదిత్య, మరో మంత్రి కిరణ్ రిజుజు తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని సహాయక చర్యల పర్యవేక్షణ కోసం కేంద్రం పంపడం తెలిసిందే.దాంతో ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు బయటపడనున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద.. 19 విమాన సర్వీసులతో 3,726 మంది విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విమాన సర్వీసులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి నడిపించనున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే. విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించి, అక్కడికి సమీపంలోని విమానాశ్రయాలకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా భారత్ కు విమానాల్లో చేరవేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement