Friday, April 26, 2024

పేదలకు ‘పట్టా’భిషేకం.. మంత్రి పువ్వాడ కృషితో శాశ్వత పరిష్కారం

సుదీర్ఘ కాలం నుండి పేదలు ఎదుర్కొంటున్న ఇళ్ళ పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో నెరవేరింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టలో నిర్వాసితులు 77 మందికి శాశ్వత ఇళ్ళ పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు గురువారం పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్న 324 మంది నిర్వాసితులకు మంత్రి పువ్వాడ కృషితో వారి కల నేరవేరింది. ఖమ్మం నగరంలోని 4వ డివిజన్ లో 77, 58వ డివిజన్ దొరన్నకాలనీ 127, 31వ డివిజన్ కాటన్ మార్కెట్ ప్రాంతంలో 138, స్థానిక నిర్వాసితులకు మంత్రి పువ్వాడ కృషితో  342 మందికి శాస్వత పట్టాలతో పేదల చిరకాల స్వప్నం నెరవేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement