సోషల్ మెస్సేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఇండియా హెడ్ ఇవ్వాల (మంగళవారం) రాజీనామా చేశారు. వాట్సాప్ ఇండియా హెడ్గా ఉన్న అభిజిత్ బోస్తోపాటు పలువురు కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో వారి రాజీనామా ఖాయం అని తెలుస్తోంది. ఇక.. అభిజిత్ బోస్తోపాటు మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే.. వీరి ఇంత పెద్ద కంపెనీకి ఎందుకు రాజీనామా చేశారన్న విషయం మాత్రం తెలియలేదు.
కాగా, ట్విట్టర్ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ సంస్కరణలు, ఆదాయాల మెరుగు పేరిట ఆ సంస్థలోని 4,400 మంది తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎట్లాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే, అప్పటికప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.