Saturday, May 4, 2024

రెండు డోసుల్లో వేర్వేరు వ్యాక్సిన్‌లు తీసుకుంటే ఏమవుతుంది?

కరోనా వ్యాక్సిన్ తీసుకునేవారు ఫస్ట్ డోస్ కొవిషీల్డ్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మన దేశమే కాదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ ఇదే నిబంధనను పెట్టాయి. కానీ, ఇటీవల కొన్ని దేశాలు ఫస్ట్ డోస్ ఒక వ్యాక్సిన్ ఇచ్చి.. సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ ఇస్తున్నాయి. ఈ ప్రక్రియ ఎంతవరకు సేఫ్? దాని వల్ల కలిగే లాభనష్టలేంటి? దీనిపైనే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అధ్యయనం చేశారు.

మొత్తంగా రెండు డోసులకు రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసినా పెద్దగా ఎలాంటి సమస్యలు రావని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక డోస్ ఆస్ట్రాజెనెకా, మరో డోస్ ఫైజర్ టీకాలు తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇలా టీకాలు తీసుకున్న 10 శాతం మందిలో తీవ్రమైన అలసట ఉన్నట్టు గుర్తించారు. దాంతో పాటు తలనొప్పి, జ్వరం వంటి సహజమైన లక్షణాలూ చాలా మందిలో కనిపించాయని తేల్చారు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులేం లేవని, ఒకట్రెండు రోజుల్లోనే అంతా సాధారణమైపోయిందని చెప్పారు. అయితే ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే అలసట తీవ్రత కొంచెం ఎక్కువని తేల్చారు. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అలసట కేవలం 3 శాతం మందిలోనే ఉందన్నారు. ప్రస్తుతం అధ్యయనంలో పాల్గొన్నది 50 ఏళ్లకు పైబడినవారేనని, యువతలో అలసట ఇంకొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీకాల కొరత నెలకొంది. నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసులుగా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అల్పాదాయ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరత ఉన్నా టీకా కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకుపోవచ్చని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement