Saturday, May 25, 2024

TS: వెల్​కమ్​ టు తెలంగాణ.. బీజేపీ లీడర్లను ఆహ్వానిస్తున్న ప్రభుత్వ పథకాల బోర్డులు!

తెలంగాణకు వచ్చే వారిని వెల్​కమ్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోర్డింగులు, గ్లో సైన్​ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎనిమిదేండ్ల నుంచి తెలంగాణ ఎలా పురోగమిస్తున్నది.. వివిధ రంగాల్లో ఎలా దూసుకెళ్తోంది అనే అంశాలతో వీటిని రూపొందించారు. హైదరాబాద్​ సిటీలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఇంగ్లిష్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులకు తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మీద అవగాహన కలగడానికి వీలుగా వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే.. వీటిని చూసి బీజేపీ నాయకులు అవాక్కవుతున్నారు.

ఎటు చూసినా తెలంగాణ ప్రగతిని చాటి చెప్పే ఈ హోర్డింగులు తమ జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల నాయకులు చూస్తే తెలంగాణ బీజేపీ పరువు గంగలో కలుస్తుంది అని వారు అనుకుంటున్నట్టు సమాచారం. నిజానికి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. అభివృద్ధి సూచీల్లో కూడా తెలంగాణ కన్నా బీజేపీ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ హోర్డింగుల ద్వారా బీజేపీ అగ్ర నాయకత్వానికి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement