Monday, April 29, 2024

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జేపీ నడ్డాతో ఈటల

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామనే అనే సంకేతాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.

హుజురాబాద్ ఉపఎన్నిక‌ల్లో ఈటెల రాజేంద‌ర్ 23 వేల‌కు పైగా మెజారిటీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ పై విజ‌యం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనను అభినందిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. దానికి ఈటెల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర రిప్లై ఇచ్చారు. త‌న పై న‌మ్మ‌కం ఉంచినందుకు జేపీ న‌డ్డాకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌ధాని మోదీ, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసేందుకు మీ సూచ‌న‌లు మమ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నాయని చెప్పారు. వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి, మేము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈటల రాజేంద‌ర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పార్టీలు మారే వ్య‌క్తిని కాదు.. కుట్ర‌దారుడు కుట్ర‌ల‌కు నాశ‌న‌మైపోతాడు: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement