Friday, May 3, 2024

షెకావత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం… హరీశ్ రావు

కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్రమే అనుమతులు ఇచ్చిందన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర మంత్రి షెకావత్ మెచ్చుకోలేదా అని అన్నారు. కేంద్ర మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement