Thursday, May 2, 2024

Breaking: బీజేపీ త‌ప్పుల్ని ప్ర‌శ్నిస్తే అవినీతి చేసిన‌ట్టా?.. కేంద్రంపై మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం

కేంద్రంలోని బీజేపీని, ప్ర‌భుత్వ విధానాల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌శ్నిస్తున్నందువ‌ల్ల‌నే తెలంగాణ‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని, మీకు న‌చ్చితే నీతి.. లేకుంటే అవినీతి జ‌రిగిన‌ట్టా? అని మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇవ్వాల (గురువారం) మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప‌లు అంశాల‌ను లేవ‌నెత్తారు. కేంద్రం మాట మార్చి రాజ‌కీయం చేస్తోంది. కాళేశ్వ‌రంలో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని పార్ల‌మెంట్‌లోనే కేంద్ర మంత్రి విశ్వేశ్వ‌ర్ తుడు స్ప‌ష్టం చేశారు. అయితే మ‌ళ్లీ అవినీతి మాట‌లు ఎందుకు మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. బీజేపీ త‌ప్పుల్ని సీఎం కేసీఆర్ ఎత్తిచూపుతున్నార‌నే ఇట్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement