Saturday, May 18, 2024

Breaking: ప్ర‌జ‌ల ఆశీర్వాదం కావాలి.. దేశంలో తెలుగుపార్టీ స‌క్సెస్ కావాలి: మంత్రి కేటీఆర్‌

ఉద్యమ నేత‌గా కేసీఆర్ మాట్లాడిన తీరు, అప్ప‌టి పాట‌లు అంద‌రూ ఆచ‌రిస్తున్నార‌ని, అదే తెలంగాణ యాస సినిమాల్లోనూ స‌క్సెస్ సాధిస్తోంద‌న్నారు మంత్రి కేటీఆర్‌. అయితే.. దేశ‌మంతా తెలుగు సినిమాలు ఎట్లా హిట్ కొడుతున్నాయో, ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంటే తెలుగు నేల‌పై పుట్టిన పార్టీ దేశ‌మంతా దుమ్ము రేపుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇవ్వాల (ఆదివారం) రాత్రి క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన క‌ళోత్స‌వాల కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు కేటీఆర్‌. హైద‌రాబాద్‌లోనూ క‌ళోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇక‌.. తెలంగాణ‌లో ఎరుపు, తెలుపు ఇప్పుడు గులాబీ రంగుగా మారింద‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement