Monday, May 6, 2024

ఒడిశా మాజీ సీఎం హేమానంద బిస్వాల్ మృతికి – ఉప రాష్ట్రపతి సంతాపం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన అంకితభావాన్ని గుర్తుంచుకుంటానని అన్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ హేమానంద బిస్వాల్ మృతి మాకు బాధ కలిగించింది. అతను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడాడ‌ని అన్నారు. ఒడిశా అభివృద్ధికి ఆయన చేసిన అంకితభావానికి గుర్తుండిపోతార‌న్నారు. అతనిని కోల్పోయిన కుటుంబ సభ్యులు,స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అని భారత ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement