ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫ్లెక్సీల కలకలం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్బంగా పవన్ అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీని విజయవాడలో ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. విజయవాడలోని కృష్ణలంక సమీపంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరో సినిమాకు తెలంగాణ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని, ఏపీ ప్రభుత్వం కక్ష కట్టి కావాలని సినిమాను తొక్కే ప్రయత్నం చేస్తుంని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, జనసేన నేత నాదెండ్ల మనోహార్, వంగవీటి రాధాకృష్ణ ఫొటోలు కూడా ఉండటం విశేషం. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతును తెలియజేసేందుకు పవన్ అభిమానులు కేసీఆర్ భారీ ఫ్లెక్సీని విజయవాడలో ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital