Friday, March 29, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరో రికార్డు సృష్టించింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు హుండీ ఆదాయం కూడా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసులు తగ్గడంతో తిరుమలకి వచ్చే భక్తులు సంఖ్యక్రమంగా పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారిని 56,559 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement