Thursday, May 2, 2024

మేడారం జాతర కమిటీలో – వద్దిరాజు రవిచంద్రకు చోటు

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క , సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా ప్రసిద్ధిగాంచి , దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని కోరిన కోర్కెలు తీర్చమని వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకొంటూ ఉంటారు. అలాంటి మహత్తర జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ ఎనలేని సేవలు చేసిన గాయత్రి గ్రానైట్ సంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్రకి ఈ అవకాశం దక్కటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్
 పేజీల‌ను ఫాలో అవ్వండి..

http://లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement