Wednesday, April 24, 2024

ఆస్తి కోసం భలే స్కెచ్..​ వివాహేతర సంబంధం ఎంత పనిచేసిందంటే..

భర్త, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పైగా తనతో వివాహానికి అతడు అంగీకరించలేదనే కోపంతో ఓ సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించింది. భయపెట్టి.. బలవంతంగా దండలు మార్పించి పెళ్లి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. 

పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అయితే.. శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. శ్రీను కూడా వివాహితుడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు.

నష్టపరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అనంతరం ఆ వివాహిత ప్రియుడినే పెళ్లి చేసుకొని, అతని ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్‌ వేసింది. శ్రీను కిడ్నాప్‌‌కు ఓ సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుంది. నిన్న పట్టణ శివారులో గ్యాంగ్‌ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని పాకాల వైపు వెళ్లింది. స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్‌ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్‌ శ్రీనును, మహిళ ను గంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement