Sunday, May 5, 2024

UPSC Result : యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను ఈరోజు విడుద‌ల చేసింది. ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌సైట్‌ www.upsc.gov.in లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మే 28న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ నిర్వ‌హించ‌గా, 16 రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. 14,624 మంది అభ్య‌ర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయిన‌ట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్ర‌క‌టించారు. వీరంతా ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ఈ ప్రిలిమ్స్‌లో అర్హ‌త‌ సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం డీఏఎఫ్ -1 లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement