Tuesday, April 30, 2024

రికార్డ్ సృష్టిస్తున్న ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ భూములు .. గ‌జం ఎంతో తెలుసా ..

వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక‌టి. ఎన్నో రాష్ట్రాల వారే కాదు ..ప‌లు దేశాల వారు తెలంగాణ‌కి త‌ర‌లివ‌స్తుంటారు. కొంత‌మంది ఇక్క‌డే సెటిల‌వుతుంటారు కూడా. ఈ నేప‌థ్యంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. దాంతో కొత్త రికార్డులు నెల‌కొన్నాయి. వివ‌రాలు చూస్తే .. రీసెంట్ గా చేప‌ట్టిన ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ భూముల వేలంలో ప‌లికిన ధ‌ర‌లు కొత్త రికార్డుల‌ని న‌మోదు చేశాయి. న‌గ‌ర శివారులో ఉన్న ఈ భూములు గ‌జానికి ల‌క్ష రూపాయ‌లంటే మాట‌లా చెప్పండి. దాంతో హైద‌రాబాద్ అభివృద్ధి మంచిదేగాని ఇక్క‌డి భూముల ధ‌ర‌లు మాత్రం ఆకాశానంటుతున్నాయ‌నేది న‌గ్న స‌త్యంగా మారింది.

అంతేకాదు ఇప్పుడు వేలం వేస్తున్న భూములు.. గతంలో వేలం వేయటానికి ప్రయత్నించి.. అమ్ముడు పోనివి అంటే ఆశ్చ‌ర్య‌పోక‌మాన‌రు. మ‌రి అప్పట్లో అమ్ముడుపోని ఈ భూముల ఇప్పుడు బంగారంలా మారి.. సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే ధరలు పలకటం హాట్ టాపిక్ అయింది. రియల్టర్ల అంచనాలు.. హెచ్ఎండీఏ అధికారులు లెక్కలు తప్పి.. ఊహించని రీతిలో వేలంలో పలికిన ధరలకు అధికారులు సైతం అవాక్కు అయ్యే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

తాజాగా ఉప్పల్ భగాయత్ లోని ఫేజ్ 1.. ఫేజ్ 2 లేఔట్లలో 23 ఫ్లాట్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా హెచ్ఎండీఏ ఈ-వేలాన్ని నిర్వహించారు. ఇందులో 21 నివాసిత ప్లాట్లు కాగా.. రెండు మాత్రం వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు గజానికి అప్ సెట్ ధర రూ.35 వేలుగా నిర్ణయిస్తే..ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా గజం రూ.లక్ష మార్కును దాటేయటం విశేషం. ఇప్పటివరకు ఐటీ కారిడార్ గా పేరున్న మాదాపూర్.. గచ్చిబౌలి.. హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇలాంటి ధరలు పలికేవి. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ నగర శివారుల్లో ఒకటైన ఉప్పల్ భగాయత్ భూములకు ఇంత భారీ ధర పలకటం విశేషం. అయితే.. ఇదంతా రియల్ ఎస్టేట్ వర్గాల మాయాజాలమన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. వేలంలో భాగంగా తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు భారీ ధరను పెట్టటం చూస్తే.. ఇందులో ఏదో మతలబు ఉందన్న వాదన రియల్ వర్గాల్లో వినిపిస్తోంది. గజం లక్ష రూపాయిల మార్కు దాటిన రెండు ప్లాట్లు తక్కువ విస్తీర్ణం ఉన్నవి కావటం.. ఆ ధరే హైలెట్ కావటం చూసినప్పుడు.. పెద్ద బిట్లు మాత్రం తక్కువ ధర (గజం రూ.77వేలు) పలకటం గమనార్హం.

ఇప్పటి ఉప్పల్ భగాయత్ మాత్రమే కాదు.. గతంలోని కోకాపేటలో జరిగిన భూముల వేలంలోనూ..తక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లకు అత్యధిక ధరకు సొంతం చేసుకోవటం ద్వారా.. ఆ ధరే ప్రముఖంగా అందరి నోట్లో నానటం ద్వారా.. సదరు ప్రాంతంలో భూముల ధరల్ని భారీగా పెంచేందుకు వీలవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా.. న‌గ‌ర శివారులోనే భూముల‌కి ఇంత రేటు ఉంటే..మ‌రి న‌గ‌రం న‌డిబొడ్డున్న ఉన్న భూముల మాటేంటి అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల మాయాజాలం అంతా ఇంతా కాదు..వారికి కాసుల వ‌ర్ష‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement