Sunday, May 19, 2024

KTR: కేంద్ర మంత్రి అమిత్‌ షాకు కేటీఆర్‌ కౌంటర్‌

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లీష్‌, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కౌంటర్‌ ఇచ్చారు.  దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘’భాషా దురాభిమానం, ఆధిపత్యం బూమరాంగ్‌ అవుతుంది. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎవరిని ప్రార్థించాలో మీరే చెబుతారా..? రాష్ట్రాల సమాఖ్య నిజమైన వసుధైక కుటుంబం. నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే  గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని. నా మాతృభాష తెలుగు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్‌ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement