Friday, April 26, 2024

ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదన్న కేంద్ర మంత్రి తోమర్

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఒక్కరోజులోనే మాట మార్చారు. నిన్న ‘‘అగ్రి చట్టాలను మళ్లీ తీసుకొస్తాం’’ అని ప్రకటించిన ఆయన.. ఈ రోజు (ఆదివారం) వ్యవసాయ చట్టాలను తిరిగి తెచ్చే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మాట మార్చారు. “వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు చేపట్టడం లేదు. రైతులను గౌరవించటానికి, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు” అని తోమర్ మీడియాకు చెప్పారు.

ఈ అంశంపై గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తోమర్ ఆరోపించారు. అయోమయానికి గురిచేస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement