Thursday, May 2, 2024

కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రిని క‌లిసిన అడివిశేషు..శ‌శికిర‌ణ్ తిక్కా – ట్రైల‌ర్ వీక్షించిన రాజ్ నాథ్ సింగ్

26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా వ‌స్తోంది మేజ‌ర్ చిత్రం.. హీరో అడివి శేష్ .. డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్కా కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మేజ‌ర్ చిత్ర ట్రైల‌ర్ ని వీక్షించారు రాజ్ నాథ్ సింగ్. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కా..హీరో అడివిశేష్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇండియా గ్రేట్ హీరో క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న డైరెక్ట‌ర్ శశిక‌ర‌ణ్, అడివి శేష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ రాజ్‌నాథ్ సింగ్ కుటుంబ‌స‌భ్యుల కోసం మేజ‌ర్ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ వేయ‌నున్నారు. సోనీ పిక్చ‌ర్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్టార్ హీరో మ‌హేశ్ బాబు వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గూఢ‌చారి మూవీ త‌ర్వాత శోభితా ధూళిపాళ మ‌రోసారి అడివి శేష్‌కు జోడీగా న‌టిస్తోంది. స‌యీ మంజ్రేక‌ర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, రేవ‌తి, అనీష్ కురువిల్లా, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో 2022 జూన్ 3న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement