Wednesday, May 15, 2024

ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి – కేంద్ర మంత్రి అమిత్ షా ప్ర‌త్యేక‌పూజ‌లు

సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యానికి వెళ్లి ప్ర‌త్యేక‌పూజ‌లు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..కాగా ఆయ‌న ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ త‌రుణ్ చుగ్ త‌దిత‌రులు అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్థానిక బీజేపీ నేత‌లతో క‌లిసి సికింద్రాబాద్ ప‌రిధిలోని ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యాన్ని వెళ్లిన అమిత్‌ షా … అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మునుగోడులో ఆదివారం సాయంత్రం జ‌ర‌గ‌నున్న బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లో ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నారు. ఈ స‌భ కోస‌మే అమిత్ షా ఆదివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement