Thursday, May 16, 2024

ఘనంగా కోరుకంటి వివాహ మహోత్సవం.. హాజరైన మంత్రులు

పెద్దపల్లి : రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కుమారుడు మణిదీప్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం గోదావరిఖనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన వివాహానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వధూవరులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ వినోద్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ రామ్మోహన్ లతో పాటు పలువురు ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement