Sunday, May 19, 2024

ఎలాన్ మ‌స్క్ పై డెలావేర్ కోర్టులో – వ్యాజ్యం దాఖ‌లు చేసిన ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం

ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం డెలావేర్ కోర్టులో ఎలాన్ మ‌స్క్ పై వ్యాజ్యం దాఖ‌లు చేసింది. ట్విట్ట‌ర్ ని కొనుగోలు చేస్తాన‌ని ఉత్సాహం ప్ర‌ద‌ర్శించిన టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ వెన‌క్కి తగ్గారు. కాగా తాను ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని ప్రకటించేశారు. దీంతో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ యాజమాన్యం డెలావేర్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. మస్క్ ప్రకటించినట్టుగానే ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై మస్క్ స్పందించారు. నేను ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని వారు చెప్పారు. వారి దగ్గర ఉన్న బోట్ సమాచారం ఇవ్వడం లేదు.

ఇప్పుడు వారు నన్ను ట్విట్టర్ ను కొనుగోలు చేసేలా బలవంతం చేసేందుకు కోర్టుకు వెళ్లారు. కనుక వారు కోర్టులో అయినా బోట్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. ట్విట్టర్ వేదికపై ఎక్కువ నకిలీ ఖాతాలున్నట్టు మస్క్ ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చెప్పిన దానికి మించి బోట్ (కంప్యూటర్ ప్రోగ్రామ్) ఆధారితంగా నడిచే నకిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయనేది కచ్చితంగా తేల్చాలని కోరారు. ఇందుకు ఆధారాలు కూడా అడిగారు. కానీ, ట్విట్టర్ ఈ అంశంలో తగినంత సమాచారం ఇవ్వలేకపోయింది.మ‌రి కోర్టు ఏం తీర్పు ఇవ్వ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement