Monday, May 6, 2024

గంట‌లో 4.60ల‌క్ష‌ల టిక్కెట్లు కొనుగోలు – టీటీడీ రికార్డ్

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల అమ్మ‌కాలు రికార్డు నెల‌కొల్పాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించి శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల‌ను టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. జ‌న‌వ‌రి నెల మొత్తానికి 4.60ల‌క్ష‌ల టిక్కెట్ల‌ని ఆన్ లైన్ లో విడుద‌ల చేసింది టీటీడీ. కాగా కేవ‌లం 60నిమిషాల్లో భ‌క్తులు ఈ టికెట్ల‌ను కొనుగోలు చేయ‌డం విశేషం. జనవరికి సంబంధించి వసతి బుకింగ్స్ ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. కాగా జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఇంకా విడుద‌ల చేయాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement