Friday, May 3, 2024

ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కి స్నాక్స్ , వాట‌ర్ – ‘స‌జ్జ‌నార్’ మ‌రో ఆఫ‌ర్

ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్ బాద్య‌త‌లు చేప‌ట్టిన‌నాటి నుంచి ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ..ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. కాగా దూర ప్రాంత ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. గరుడ ప్లస్, రాజధాని బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్స్, స్నాక్స్, త్రాగునీటి వసతులు మొదలగునవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..తన సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ఈ వసతు లను తెలంగాణ ప్రయాణి కులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement