Sunday, May 5, 2024

ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో మొన్న ఫిష్ క్యాంటిన్ లు – నేడు మ‌ట‌న్ హోట‌ళ్లు…

హైద‌రాబాద్ – నాన్ వెజిటేరియ‌న్స్ ఇది శుభ‌వార్తే.. తెలంగాణ ప్ర‌భుత్వం వివిధ రకాల నాన్ వెజ్ వంట‌కాల‌తో భోజ‌న ప్రియుల‌కు వండి వార్చ‌నుంది.. త్వ‌ర‌లో మ‌ట‌న్ క్యాంటిన్ లో ఏర్పాటు కానున్నాయి.. రాష్ట్రంలో తొలి మటన్ క్యాంటీన్‌ను హైదరాబాద్‌ శాంతిన‌గ‌ర్ కాల‌నీలో కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ కార్యాల‌యం వద్ద ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్యాంటీన్లలో మటన్ బిర్యానీతో పాటు పాయ, కీమా, పత్తార్ కా గోస్ట్, గుర్ధా ప్రై వంటి రుచికరమైన వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ క్యాంటీన్ మార్చిలో ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లో ఈ క్యాంటీన్లు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తున్న సంగతి విదితమే. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఫిష్ క్యాంటీన్లలో ప్రస్తుతం ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వెరైటీ వంట‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఫిష్ క్యాంటీన్లు విజ‌య‌వంతంగా న‌డుస్తుండ‌టంతో మ‌ట‌న్ క్యాంటీన్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement