Monday, April 29, 2024

కడుపులో కత్తెర.. ఆరేళ్ల తరువాత బయటపడిన వైనం..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలకు అపాయంగా మారింది. మహిళకు ఆపరేషన్‌ చేసి కత్తెరను కడుపులోనే మర్చిపోయాడు డాక్టర్‌. ఆరేళ్ల క్రితం మంచిర్యాలకు చెందిన మహిళకు ఆపరేషన్‌ జరిగింది. కొంతకాలంగా ఆమెకు కడుపులో నొప్పి రావడంతో ఎక్స్‌రే తీయించుకుంది. దీంతో ఎక్స్‌రే రిపోర్టును పరిశీలించిన వైద్యులు మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్యుడిని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక ఆపరేషన్‌ ఖర్చు భరిస్తానని వైద్యుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement