Saturday, April 27, 2024

Breaking: రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement