Wednesday, March 27, 2024

ప్రియురాలి మోసం : యువ‌కుడు సెల్ఫీ సూసైడ్

ప్రియురాలు మోసం చేయ‌డంతో ఓ ప్రియుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మాగంకొప్పిశెట్టివారి పాలెంలో ఈ విషాదం ఘటన జరిగింది. ప్రేమ పేరుతో భారీగా డబ్బులు, బంగారం తీసుకొని అమ్మాయి మోసం చేసిందని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు కొంతకాలం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ.. అంతలోనే ఆ అమ్మాయి శంకర్ కు హ్యాండ్ ఇచ్చింది. మరొకరితో పెళ్లికి సిద్ధమైంది.

ప్రేమ పేరుతో నన్ను చాలా విధంగా మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోతున్నా..నన్ను అన్ని విధాలుగా వాడుకుంది. డబ్బు, బంగారం, బట్టలు, ప్రతి విషయంలో నన్ను వాడుకుంది. ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్లిపోతుంది. అందుకే నేను చచ్చి పోతున్నాను.., బాయ్ ఫ్రెండ్స్ అంటూ సదరు యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అమ్మాయి మోసం చేయంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసుల ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement