Thursday, May 9, 2024

TRS: వ‌డ్ల‌కు, గోధుమ‌ల‌కు తేడా తెలియ‌ని వ్యక్తి: బండి సంజయ్ పై పల్లా ఫైర్

రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ‌డ్ల‌కు, గోధుమ‌ల‌కు తేడా తెలియ‌ని వ్యక్తి బండి సంజ‌య్ అని అన్నారు. నిన్న‌టి బీజేపీ ధ‌ర్నాలో బండి సంజ‌య్ పిచ్చికుక్క‌లా మాట్లాడార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంజ‌య్ వార్డ్ మెంబ‌ర్ స్థాయి క‌న్నా త‌క్కువ‌గా దిగ‌జారి మాట్లాడార‌ని విమర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ ఎలా జ‌రుగుతుందో కూడా బండికి క‌నీస అవ‌గాహ‌న లేద‌న్నారు. వ‌రి వేయ‌మ‌ని రైతుల‌ను రెచ్చ‌గొట్టింది బీజేపీ కుక్క‌లే అని వ్యాఖ్యానించారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామ‌ని చెప్పి.. ఇవాళ ముఖం చాటేసింది బీజేపీ కుక్క‌లు కాదా? అని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాల బూట్లు నాకడం తప్ప బండి సంజయ్ కు ఇంకేమైనా తెలుసా? అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తిన‌డం నేర్పించాల‌ని పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానిస్తే.. ఆత్మ‌గౌర‌వం లేకుండా బండి సంజ‌య్ కేంద్రానికి వ‌త్తాసు ప‌లికాడ‌ని రాజేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement