Tuesday, April 30, 2024

తెలంగాణ బిడ్డల బలిదానాలకు బీజేపీయే కారణం

బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్లు తెలంగాణ ప్రజలపై అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడని.. అసలు తెలంగాణను మోసం చేసిన చరిత్ర బీజేపీదేనని అన్నారు.  మూడు చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే 2000 సంవత్సరంలో తెలంగాణ ఇచ్చుంటే ఇన్ని బలిదానాలు జరిగేవా అని ప్రశ్నించారు. బీజేపీ అవకాశవాద రాజకీయాల వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాడు తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, అరవింద్‌.. ఇప్పుడు ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం మంత్రులపై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement