Friday, May 3, 2024

పీకే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : జగ్గారెడ్డి

ప్రశాంత్ కిషోర్ విషయంలో పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోనియాతో పీకే భేటీ విషయం తమ పరిధి కాదని.. సోనియా, రాహుల్ ప్రజల మేలుకోరి పనిచేస్తారన్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు. విభజనలో ఓయూ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఓయూ, కాకతీయ వర్సిటీ విద్యార్థుల త్యాగం మరువలేమన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రాహుల్ ఓయూకు వెళ్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement