Tuesday, May 7, 2024

ఫ్లై ఓవర్లు వేస్తే అభివృద్ధి జరిగినట్టేనా ? : కిష‌న్ రెడ్డి

కాలనీలు, బస్తీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఫ్లై ఓవర్లు వేస్తే అభివృద్ధి జరిగినట్టేనా ? అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… హైఫై రోడ్లతో ఒరిగేదేమీ లేదని మంత్రి అన్నారు. హైదరాబాద్‌కు 85 వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పుతున్నారని, ఆ నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బస్తీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయ‌న విమర్శించారు. బస్తీల్లో కలుషిత నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీహెచ్ఎంసీ నిధులను ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రచారాలకు ఖర్చు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement