Friday, May 3, 2024

పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద అర్థనగ్నంగా నిరసన ధర్నా

నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద మూడవరోజు చాబోలు గ్రామస్తుల నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామస్తుల న్యాయమైన సమస్య పరిష్కరించి, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న గృహాలకు మరమ్మతులు చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ.. మూడవ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో అర్ధనగ్నంగా కాలువలో దిగి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష శిబిరంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఎం.రమేష్ బాబు, సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ… చాబోలు గ్రామస్తులకు న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట రమణ, నాగన్న, బాలరాజు, వినోద్, పెద్ద నాగన్న, రంగన్న, నాగేశ్వరావు చిన్న నాగన్న, మనోహర్, ముని, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement