Saturday, April 20, 2024

Bandi Sanjay: వరి కొనకుండా కేంద్రంపై నిందలా ?

తెలంగాణ‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఆ నిధుల‌ను వాడుతూ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. రు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేటలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చిన కేసీఆర్‌ అన్నింటినీ మర్చిపోయార‌ని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్ర‌మే పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఆర్‌డీఎస్‌ పూర్తి చేస్తామని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిందని, అయిన‌ప్ప‌టికీ ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాలయాపన చేసిందని విమర్శించారు. వరి కొనకుండా కేంద్రంపై రాష్ట్రం నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నరోడ్లకు కూడా మరమ్మతులు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘాల నిధులతో రోడ్లు, మురుగుకాల్వలను కేంద్రం నిర్మించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement