Saturday, May 18, 2024

తెలంగాణలో సర్కారీ జాబ్ మేళా.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

రాష్ట్రలో 80 వేలపై చిలుకు ఉద్యోగ నియామకాలకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచారు. తెలంగాణ భవన్ వద్ద ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. మరోవైపు కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ కేసీఆర్ చిత్రపటాలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు.

కరీంనగర్ తెలంగాణ చౌక్ లో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నృత్యాలు చేస్తూ టపాసులు కాలుస్తూ సంబరాలు జరిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు, టి ఆర్ ఎస్ అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు. మాజీ ఎమ్ ఎల్ సి నారదాసు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement