Monday, April 29, 2024

తెలంగాణలో 14 మంది ఐఏఎస్ అధికారుల‌ బదిలీ.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఇవ్వాల రాత్రి ఉత్త‌ర్వులు జారీచేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అపూర్వ్‌ చౌహాన్‌ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా నియమించింది. అశ్విని తానాజీ వాంఖడేను వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా బదిలీ నియమించి, ఇక్కడ పనిచేస్తున్న బీ హరిసింగ్‌ను బదిలీ చేసింది. బీ రాహుల్‌ను మంచిర్యాల అడిషనల్‌ కలెక్టర్‌గా నియమించింది. మయాంకర్‌ మిట్టల్‌ను నారాయణపేట అడిషనల్‌ కలెక్టర్‌గా నియమించగా.. ఇక్కడ పని చేస్తున్న కందూరి చంద్రారెడ్డిని అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

ఇక‌.. మంద మకరందును జగిత్యాలకు, బదిలీ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న జడల అన్సారీని అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని చెప్పింది. ప్రఫుల్‌ దేశాయ్‌ని జనగామకు బదిలీ చేయగా.. అబ్దుల్‌ హమీద్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. అభిషేక్‌ అగస్త్యను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ చేయగా.. ఇక్కడ పనిచేస్తున్న జాన్‌ శ్యామ్‌సన్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పింది. కుష్బూ గుప్తాను నల్గొండకు ట్రాన్స్‌ఫర్‌ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న రాహుల్‌ శర్మను వికారాబాద్‌ అడిషన్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement