Friday, April 19, 2024

Follow up : లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నాడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, మార్కెట్లకు అండగా నిలిచాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంటన్నర వరకు మార్కెట్లు ఒడుదుడుకుల్లో కొనసాగాయి. అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో సూచీలు 600 పాయింట్లకు పైగా నష్టాపోయాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో చివరకు పుంజుకుని లాభాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.

సెన్సెక్స్‌ 234.79 పాయింట్ల లాభంతో తో 61185.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 85.65 పాయింట్ల లాభంతో 18202.80 వద్ద మగిసింది.

బంగారం 10 గ్రాముల ధర 87 రూపాయలు పెరిగి 50953 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 485 రూపాయలు పెరిగి 61023 వద్ద ట్రేడయ్యింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.82 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజుకీ, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకీ, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, ఎల్‌అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఓఎన్‌జీసీ, అపోలో ఆసుప్పటల్స్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌ కంపెనీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement