Monday, May 20, 2024

క‌రెంట్ షాక్ తో మూడు ఏనుగులు మృతి

క‌రెంట్ షాక్ తో మూడు ఏనుగులు మృతిచెందిన ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ధ‌ర్మ‌పురి జిల్లా మ‌రంద‌న‌హ‌ళ్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రామాల్లోకి ఒక్క‌సారిగా ఐదు ఏనుగులు వ‌చ్చాయి. అయితే మ‌రంద‌న‌హ‌ళ్లిలోని పొలాల్లో క‌రెంట్ తీగ‌లు త‌గ‌ల‌డంతో ఏనుగులు చ‌నిపోయాయి. గ్రామ‌స్తులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచార‌మివ్వ‌డంతో అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement