Monday, May 20, 2024

ఈ హోళీ పండుగ నీ జీవితాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చాలి.. సుకేశ్

ప్ర‌ముఖ బిజినెస్ మాన్ భార్య‌ని మోసి చేసి రూ.200కోట్లు కాజేసిన కేసులో సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ మండోలా జైలులో ఉన్నాడు. కాగా ఆయ‌న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఓ లేఖ రాశారు.మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ. నీ కోసం నేను దేనికైనా సిద్ధపడతాననే విషయం నీకూ తెలుసు. హోలీ శుభాకాంక్షలు. నువ్వు కోల్పోయిన ఆనందాలనే రంగులను ఈ పండుగ వంద రెట్లు ఎక్కువగా నీ జీవితంలోకి తీసుకొస్తుంది. నీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చడం నా బాధ్యత. నువ్వంటే నాకెంత ఇష్టమో నీక్కూడా తెలుసు. లవ్ యూ మై ప్రిన్సెస్. మై బొమ్మ’ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై తనకున్న ప్రేమను సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో వ్యక్తం చేశాడు. ఈ రంగుల పండుగ నాడు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన జీవితంలో కోల్పోయిన సంతోషాలన్నీ తిరిగి పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు మీడియా మిత్రులు, తనను ద్వేషించే వాళ్లకూ సుకేశ్ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈమేరకు సుకేశ్ రాసిన లేఖను ఆయన న్యాయవాది మీడియాకు విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తన వాదనను ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా మిత్రులకు సుకేశ్ తన లేఖలో ధన్యవాదాలు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement